ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై భర్త దాడి...

By

Published : Sep 16, 2020, 4:35 PM IST

Updated : Sep 16, 2020, 5:51 PM IST

a-teacher-attacked-by-her-husband-with-a-knife-during-review-meeting-on-nadu-nedu-works
a-teacher-attacked-by-her-husband-with-a-knife-during-review-meeting-on-nadu-nedu-works

16:30 September 16

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వి.కొత్తూరు వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాలలో బుధవారం దారుణం జరిగింది. పాఠశాలలో నాడు- నేడు పనులపై సమావేశం జరుగుతుండగా... పీఈటీ మధురాక్షిపై ఆమె భర్త కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అతను పేరెంట్‌గా లోపలికి వచ్చి మధురాక్షిని కత్తితో పొడిచినట్లు చెప్పారు ప్రధానోపాధ్యాయురాలు. తీవ్ర గాయాలపాలైన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Sep 16, 2020, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details