ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2021, 3:07 PM IST

ETV Bharat / state

పోలింగ్​ కోసం పటిష్ట చర్యలు చేపట్టాం: తిరుపతి ఎస్పీ

ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారన్న సమాచారం మేరకు ఇప్పటికే కొంతమందిపై చర్యలు తీసుకున్నామని తిరుపతి అర్బన్​ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

tirupati sp venkata appaiahnaidu says police department have taken strong security measures for polling
పోలింగ్​ కోసం పటిష్ట చర్యలు చేపట్టాం: తిరుపతి ఎస్పీ

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగ పంచాయతీలో ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసిచ్చిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గ్రామపంచాయతి పరిధిలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

జిల్లాలో ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారని రామచంద్రాపురం, వడమాలపేట మండలాల పోలీస్​స్టేషన్​ల నుంచి పలు ఫిర్యాదులు అందాయని అర్బన్​ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. కొన్ని ఘటనలను సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేశామన్న ఆయన పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాజ్యసభ ఛైర్మన్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు: భానుప్రకాశ్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details