తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.... సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోది. శ్రీవారిని నిన్న 83వేల 050 మంది భక్తులు దర్శించుకున్నారు. 40వేల 027 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి నిన్నటి ఆదాయం 2 కోట్ల 61 లక్షలుగా అధికారులు తెలిపారు.
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
శ్రీరామ నవమి, వేసవి సెలవులతో... తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.