ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 2:08 PM IST

ETV Bharat / state

ఆలయం తెరిచి ఉంది.. కానీ వెళ్లేందుకు దారిలేదు!

చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. కరోనా కారణంగా పట్టణంలో లాక్ డౌన్ విధించిన పోలీసులు.. గుడికి వెళ్లే మార్గానికి సూచికలు పెట్టలేదు. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

tiruchanuru lock down
tiruchanuru lock down

చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తెరిచి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పట్టణాన్ని లాక్ డౌన్​గా ప్రకటించారు పోలీసులు. విషయం తెలియని భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ వెళ్లే దారిని మూసివేయటంతో.. ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

లాక్ డౌన్ విషయం ముందుగానే చెప్పి ఉంటే తాము రాకుండా ఉండేవాళ్లమని చెప్పారు. దుకాణాలు మూసి ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంచినీరు, ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. తితిదే అధికారులు, పోలీసులు స్పందించి గుడికి వెళ్లే మార్గానికి సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయినా పట్టణం లాక్ డౌన్​లో ఉన్నప్పుడు ఆలయం మాత్రం ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details