ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2020, 10:50 PM IST

ETV Bharat / state

'పడమటి మండలాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు'

చిత్తూరు జిల్లా పడమటి మండలాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు చేపట్టామని హెచ్ఎన్ఎస్ఎస్ చీఫ్ ఇంజినీర్ హరినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో కొత్తగా ముదివేడు, సోమల, నేతిగుంటపల్లి జలాశయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

'పడమటి మండలాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు'
'పడమటి మండలాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు'

చిత్తూరు జిల్లా పడమటి మండలాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు చేపట్టామని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గండికోట జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలో మూడు జలాశయాలకు నీటిని నింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన ఆయన...జిల్లాలో కొత్తగా ముదివేడు, సోమల, నేతిగుంటపల్లి జలాశయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 1,912 కోట్ల పరిపాలన పరమైన అనుమతులిచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details