ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2020, 3:39 PM IST

ETV Bharat / state

ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ పుత్తూరులో తెదేపా నిరసన

ప్రభుత్వం పెంచిన ఆస్తి, నీటిపన్నులకు నిరసనగా చిత్తూరు జిల్లా పుత్తూరులో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం పెంచిన పన్నులను రద్దు చేయాలని.. పుత్తూరు పట్టణ తెదేపా అధ్యక్షుడు గాలి జీవరత్నం పిలుపునిచ్చారు.

tdp followers protest in putturu at chittor for hiking taxes
ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ పుత్తూరులో తెదేపా నిరసన

ఆస్తిపన్ను పెంపునకు నిరసనగా.. చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆస్తిపన్ను, మరుగుదొడ్లు, నీటి పన్నులను సైతం పెంచుతున్నారని వారు పేర్కొన్నారు. పన్నుల పెంపును అన్ని వర్గాలు అడ్డుకోవాలని పుత్తూరు పట్టణ తెదేపా అధ్యక్షుడు గాలి జీవరత్నం పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెంచిన పన్నులను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details