ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 1:36 PM IST

Updated : Jun 4, 2020, 3:20 PM IST

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలిపివేత: ఆలయ ఈవో

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలిపివేత కొనసాగనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. కరోనా రెడ్​జోన్​లో ఆలయం ఉండటం వల్ల దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు దర్శనాలు ఉండవని వెల్లడించారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలివేత: ఆలయ ఈవో
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలివేత: ఆలయ ఈవో

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి భక్తులకు ఆలయాలల్లో దర్శనం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీకాళహస్తి రెడ్​జోన్ పరిధిలో ఉండటంతో శ్రీకాళహస్తీశ్వరాలయంలో మరికొన్ని రోజులు భక్తులకు అనుమతించ కూడదని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల జారీ చేసినట్లు ఈవో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో ఆరు అడుగుల మేర సామాజిక దూరం పాటించేలా వలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అంతరాలయం, గర్భాలయ దర్శనం రద్దు చేయడంతో పాటు గంటకు 300మంది భక్తులు మాత్రమే దర్శించుకునేలా చర్యలు చేపట్టామని ఈవో వివరించారు. ప్రతి భక్తుడు విధిగా మాస్కులు ధరించడం సహా ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అన్నప్రసాదాలు, ఉచిత ప్రసాదాలను పంపిణీ తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్నారు.

Last Updated : Jun 4, 2020, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details