ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2021, 8:49 AM IST

ETV Bharat / state

RED SANDAL: రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత.. స్మగ్లర్ అరెస్ట్

చిత్తూరు జిల్లా పోలీసులు రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8.4 టన్నుల బరువు గల 238 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ రివార్డులు అందజేశారు.

red sandal
ఎర్ర చందనం పట్టివేత

రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత

ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పోలీసులు రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకా బొమ్మనహళ్లిలో ఎర్రచందనం స్మగ్లర్‌ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్‌ను పట్టుకున్న పోలీసులు...అక్కడ గోదాములో దాచిన 238 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.

8.4 టన్నుల ఈ ఎర్ర చందనం దుంగల విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 6.03 కోట్లు ఉంటుందన్నారు. అక్రమ రవాణకు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ...స్మగ్లర్ ఇమ్రాన్ భాయ్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details