చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రాజ్యసభ సభ్యుడు, రాజస్థాన్కు చెందిన భూపేంద్ర యాదవ్ దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర భాజపా ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.
ఈ సందర్భంగా భాజపా నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో పెద్దిరాజు... వారికి స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఎంపీలు.. తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అందుకున్నారు.