ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 5:57 PM IST

Updated : Nov 30, 2020, 6:09 PM IST

ETV Bharat / state

శివయ్య సేవలో రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్, సీఎం రమేష్

రాజస్థాన్​కు చెందిన రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. దర్శనానంతరం ఆలయ ఈవో పెద్దిరాజు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.

Rajya Sabha members Bhupendra Yadav and CM Ramesh visited srikalahasti temple
శివయ్య సేవలో రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్, సీఎం రమేష్

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రాజ్యసభ సభ్యుడు, రాజస్థాన్​కు చెందిన భూపేంద్ర యాదవ్ దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర భాజపా ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.

ఈ సందర్భంగా భాజపా నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో పెద్దిరాజు... వారికి స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఎంపీలు.. తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అందుకున్నారు.

Last Updated : Nov 30, 2020, 6:09 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details