ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2021, 2:10 PM IST

ETV Bharat / state

బిడ్డ పుట్టిన సంతోషం తీరనే లేదు.. మొదటి పెళ్లిరోజు గడవనే లేదు..?

వివాహా దినోత్సవం రోజున ఆ ఇంట విషాదం నెలకొంది. ఏడాది క్రితం ఇదే రోజున ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

person died in road accident
మరణించిన వ్యక్తి పాతచిత్రం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మఠంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కాంతమ్మ, మునిరాజల కుమారుడు శివ. అదే గ్రామానికి చెందిన పవిత్రను ప్రేమించి.. 2020 ఏప్రిల్ 16న పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం కుమారుడు జన్మించాడు. తిరుపతిలోని ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్​ ఆపరేటర్​గా పని చేస్తాడు. ఈ రోజు తెల్లవారుజామున విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తొండవాడ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన స్థానికులు 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శివ మృతి చెందాడు. పెళ్లి రోజునే భర్త మృత్యు ఒడికి చేరటంతో భార్య రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చంద్రగిరి పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:గుంటూరు జిల్లాలో లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details