ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు...

ఆధార్ కార్డు చేయించాలన్నా..మార్చాలన్నా ప్రజలకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.. రోజులు తరబడి ఎదురు చూపులు, పడిగాపులు పడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు.

By

Published : Aug 26, 2019, 3:22 PM IST

ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు

ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు

ఆధార్​లో మార్పులు చేర్పులు కోసం ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. వందల మంది గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బారులుతీరుతున్నారు. అయితే వీరి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారు. వందల మంది ప్రజలు కార్యాలయాలకు వస్తే 20లేదా 30 మందికి మాత్రమే ఆధార్​ మార్పులు చేస్తున్నారు. కొంతమంది పది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనికావటం లేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట వందల మంది ప్రజలు బారులు తీరగా.. 20 నుంచి 50 మందికి మాత్రమే పని జరుగుతుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వమే చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details