ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. ఇన్​ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

By

Published : May 19, 2019, 7:37 AM IST

నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు

ఇటీవల ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల కితబాకంటి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. సిమిలిగూడ సమీపంలోని జానిగూడ వద్ద నాయకుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఇన్​ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నవారు తమకు వద్దని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 100 మందికిపైగా పాల్గొన్నారు. దీనిపై ఆంధ్ర, తెలంగాణ పౌరసంఘ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. అనంతరం వెనుతిరిగి వెళ్లిపోయారు.

నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు

ABOUT THE AUTHOR

...view details