ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2019, 6:10 PM IST

ETV Bharat / state

'దిశ కేసులో ఎన్​కౌంటరే సరైన న్యాయం'

దిశ హత్యాచార కేసులో నిందితుల్ని పోలీసులు ఎన్​కౌంటర్ చేయటమే అసలైన న్యాయమని... తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. హత్యాచార కేసుల్లో కఠిన శిక్షలు అమలు చేయలని నినాదాలు చేశారు.

padmavathi mahila university students reaction on disha murder case encounter
దిశ హత్యకేసు ఎన్​కౌంటర్​పై తిరుపతి విద్యార్థుల ఆనందం

'దిశ కేసులో ఎన్​కౌంటరే సరైన న్యాయం'

దిశ హత్యాచారం కేసులో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారంటూ....తిరుపతి నగరం యువత ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సీపీ సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సంఘీభావాన్ని వ్యక్తం ప్రకటించారు. హత్యాచారం కేసుల్లో సత్వర న్యాయమంటే మరణశిక్షేనని వర్సిటీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. చట్టాలను బలోపేతం చేయటం, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలు చేయటమే సమస్యకు పరిష్కారమంటూ నినాదాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details