ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2019, 8:27 PM IST

ETV Bharat / state

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన

తిరుపతి సమీపంలోని శ్వేతా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళనకు దిగిన విద్యార్థులు

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన

తిరుపతి సమీపంలోని అత్తలూరు వద్ద శ్వేతా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యంగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలను ఆధార్​తో లింక్ చేయడంలో ఇండియన్ నర్సింగ్ అసోసియేషన్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా... రోజుకు కేవలం 40 మందికి మాత్రమే ఆధార్ లింక్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆన్​లైన్ సేవలు ఏర్పాటు చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details