ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 25, 2020, 1:43 AM IST

ETV Bharat / state

'ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి'

శ్రీకాళహస్తిలో కరోనా కేసులు పెరటానికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిర్వహించిన ర్యాలీనే కారణమని రాష్ట్ర తెలుగు యువత నాయకుడు మద్దిపట్ల సూర్యప్రకాశ్ ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

'MLA Madhusudan Reddy should be arrested' tdp leader surya prakash demanded
'MLA Madhusudan Reddy should be arrested' tdp leader surya prakash demanded

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా వ్యాప్తికి కారకుడైన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర తెలుగు యువత నాయకుడు మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో పెరిగిన కరోనా కేసులకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలన్నారు. లాక్​డౌన్​ వేళ ప్రచార ఆర్భాటాల కోసం మీటింగ్​లు పెట్టి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవడానికి ఎమ్మెల్యే కారకుడయ్యారని సూర్యప్రకాశ్ దుయ్యబట్టారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టిన బియ్యపు మధుసూదన్ రెడ్డి... శ్రీకాళహస్తి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మధుసూదన్ రెడ్డి సమావేశం అనంతరం శ్రీకాళహస్తిలో 11 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని సూర్యప్రకాశ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details