ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 2:58 PM IST

ETV Bharat / state

వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి నగర సమీపంలోని వకుళమాత ఆలయ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

minister peddi reddy rama chandra reddy visits vakula matha temple
వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి నగర సమీపంలోని వకుళమాత ఆలయ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. వందల సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునః నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ క్షేత్రం మహిమాన్వత క్షేత్రంగా భాసిల్లుతుందని మంత్రి అన్నారు.

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: కుక్కర్​లో తల ఇరుక్కుపోయి.. తల్లడిల్లిన చిన్నారి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details