ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​!

కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమార్కుల నుంచి కాపాడటం... ఖాళీ భూములను ప్రజా అవసరాలకు వినియోగించడం వంటి బహుళ ప్రయోజనకరమైన విధానానికి తిరుపతి నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్​ రద్దీని నియంత్రించేందుకు హథీరాం మఠం భూములను లీజుకు తీసుకునేందుకు సిద్ధమైంది.

By

Published : Jul 27, 2019, 6:12 PM IST

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​!

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​!

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో పాటు.. నగర వాసులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తీర్చే పనిలో పడింది నగర పాలక సంస్థ. ఇందు కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హథీరాం మఠం భూములను లీజు ప్రాతిపదికన తీసుకొనేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నిర్ణయంతో మల్టీ లెవల్ పార్కింగ్, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేసేందుకు సిద్ధమైంది.

తిరుపతి నగరంలో దాదాపు రెండు లక్షల ద్విచక్రవాహనాలు.... వేల సంఖ్యలో కార్లు ఉన్నాయి. వీటికి తోడు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో కార్లు, జీపులు, సుమోలు అధిక సంఖ్యలో తిరుపతికి వస్తాయి. నగరంలో సరైన పార్కింగ్ సదుపాయం లేని కారణంగా.. ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాణిజ్య సముదాయాల ముందు వాహనాలను ఆపివేస్తున్న ఫలితంగా.. ఆయా దుకాణాలకు వెళ్లే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వ్యాపారంపై ఇది ప్రభావం చూపిస్తోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

నగరంలోని విష్ణు నివాసం, రైల్వే రిజర్వేషన్ కార్యాలయం వంటి కొన్ని ప్రదేశాల్లో పెయిడ్​ పార్కింగ్ సౌకర్యం ఉంది. గాంధీరోడ్డు, తిలక్​రోడ్డు, భవానీ నగర్ వంటి కొన్ని రద్దీ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్థానిక ప్రజలతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో హథీరాం మఠం భూములను లీజ్​ ప్రాతిపదికన తీసుకుంటే మంచిదని నగరపాలక సంస్థ భావించింది. అనుమతులు కోరుతూ నగర పాలక అధికారులు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపారు.

నగరపాలక సంస్థ ప్రతిపాదనలతో అటు విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడమే కాక... ప్రజా ప్రయోజనాలకు నెరవేర్చే అవకాశం ఉంటుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details