ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆట పట్టిద్దామనుకున్నాడు.. ఉరి పడి ప్రాణాలు విడిచాడు

మద్యం మత్తు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. సరదాగా ఆటపట్టిద్దామని ఓ యువకుడి చేసిన చర్య... అతడి ఉసురు తీసింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోతున్న కాపాడలేకపోయానన్న మరొక యువకుడికి మిగిల్చింది.

By

Published : Apr 22, 2019, 10:55 PM IST

మద్యం మత్తుకి ప్రాణం బలి

మద్యం మత్తులో ఆత్మహత్య

వీడియో కాల్​లో స్నేహితుడిని ఆటపట్టిద్దామని మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రయత్నం....అతని ప్రాణాల్నే బలిగొంది. తిరుపతి శివారు ప్రాంతం దామినేడులో శంకర్ శివకుమార్ అనే 28వ సంవత్సరాల యువకుడు మద్యం మత్తులో తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. సరదాగా ఆటపట్టించటం కోసం ఫ్యానుకు ఉరివేసుకున్న శివకుమార్.... మత్తులో ఉండటంతో తిరిగి మంచంపై కాళ్లు పెట్టలేక...గాల్లోనే వేలాడుతూ కన్నుమూశాడు. అతని స్నేహితుడు కాల్ రికార్డ్ చేసి....పోలీసులకు సమాచారం అందించినా....అప్పటికే శివకుమార్ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న తిరుచానూరు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు

ABOUT THE AUTHOR

...view details