ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 18, 2021, 8:31 AM IST

ETV Bharat / state

తిరుపతిలో జాతిరత్నాలు చిత్ర బృందం సందడి

తిరుపతిలో జాతిరత్నాలు చిత్రబృందం సందడి చేసింది. శ్రీవారి దర్శనాంతరం విజయ యాత్రను ప్రారంభిస్తామని హీరో నవీన్​ తెలిపారు. తమ చిత్రం ఘన విజయం సాధించటంపై సంతోషం వ్యక్తం చేశారు.

jatiratnalu film team visit at tirupati in chittoor district
తిరుపతిలో జాతిరత్నాలు చిత్ర బృందం సందడి

తిరుపతిలో జాతిరత్నాలు చిత్ర బృందం సందడి

యువ నటుడు నవీన్ పోలిశెట్టి, ఫరియా జంటగా నటించిన జాతిరత్నాలు చిత్రం... విడుదలైన దగ్గర నుంచి నవ్వుల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. తిరుపతిలో సందడి చేసిన చిత్రబృందాన్ని తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ నిర్వాహకులు సన్మానించారు.

అనంతరం హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, ఫరియా, చిత్ర దర్శకుడు కేవీ అనుదీప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తమ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడవటం మర్చిపోలేని అనుభూతి అని నటుడు నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని.. విజయయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details