ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 5:41 PM IST

ETV Bharat / state

'పవన్​కల్యాణ్​ను విమర్శిస్తే తిరగబడతాం'

జనసేన అధినేతపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్ రాయల్ ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన గెలుపును ఓర్వలేకే అధికార నాయకులు ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

janasena tirupathi constituency incharge
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్

జనసేన అధినేతపై భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్​ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్ రాయల్ ఖండించారు. అధినేత పవన్ కళ్యాణ్​ను విమర్శించే నైతిక అర్హత గ్రంధి శ్రీనివాస్​కు లేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపర్చిన అభ్యర్థుల గెలుపును ఓర్వలేకే కొంతమంది నాయకులు ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే జనసేన కార్యకర్తలు, నాయకులు తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details