ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం కలిగిన విశాలమైన అటవీ ప్రాంతం కడప జిల్లాలో ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని గండి ప్రాంతం నుంచి మొదలైన పాలకొండలు... వీరబల్లి మండలంలోని గడికోట వద్ద శేషాచలం అడవులలో కలుస్తాయి. అక్కడి నుంచి ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాలలను అనుసంధానం చేస్తూ చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది.
రాలిన ఆకులతో ప్రమాదం...
ఈ విశాలమైన అటవీ ప్రాంతంలో ఏటా వేసవి మొదలు కాగానే ఎండల తీవ్రతకు గ్రాసం ఎండిపోయి, చెట్ల ఆకులు రాలిపోతాయి. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని అటవీ ప్రాంతంలోని వృక్ష సంపద అగ్నికి ఆహుతవుతోంది. చెట్లతో పాటు పక్షులు, జంతువులు, క్రిమి, కీటకాలు మంటల్లో కాలిపోయి వాటి మనుగడ కనుమరుగవుతోంది.