ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లిలో మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహన

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... మహిళలకు ప్రత్యేకంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

By

Published : May 4, 2019, 6:04 PM IST

తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాసంఘం ఏర్పాటుచేసిన ఈ సదస్సులో మహిళల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. జాతీయ లోక్ అదాలత్​ల ద్వారా కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కాలం వృథా, ధనవ్యయాన్ని అరికట్టడానికి లోక్ అదాలత్ వినియోగించుకోవాలన్నారు. భార్యాభర్తల తగాదాలు, విడాకులు, భూ సమస్యలు, మహిళా వేధింపులు, ర్యాగింగ్, వేధింపులు కేసులు పరిష్కార విధానాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. వెలుగు నిర్వాహకులు, మండల న్యాయ సేవాసంఘం సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details