ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2019, 1:28 PM IST

ETV Bharat / state

ఆభరణాల మాయంపై భాజపా అల్టిమేటం... లేకుంటే సమరం...

తిరుమల తిరుపతి దేవస్థానంలోని ట్రెజరీలో ఉన్న నగలు ఎలా మాయం అయ్యాయో సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే.. రేపు ఉదయం తితిదే పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆభరణాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు.

bjp-state-leader-comments-on-ttd-jewelry

'ఆభరణాల మాయంపై తితిదే ఈవో వివరణ ఇవ్వాలి'

తిరుమల వెంకన్న ఖజానాకు భద్రత లేకుండా పోయిందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు.ఖజానా నుంచి విలువైన ఆభరణాలు మాయమైతే పోలీసు ఫిర్యాదు చేయకుండా కేవలం ఓ ఉద్యోగిని బాధ్యుడిని చేస్తూ డబ్బులు రికవరీ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.చోరీ వ్యవహారాన్ని దాచాల్సిన అవసరం ఏముందని ఆయన మండిపడ్డారు.మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు...బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే రేపు తితిదే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆభరణాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details