నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించినట్లు భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎంపీడీవో, ఆర్వోలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై.. వైకాపా మద్దతుదారులకు ఏకగ్రీవాలు చేయించారని మీడియా సమావేశంలో ఆరోపించారు. తుది విడతలో ఎలాంటి అవకతవకలు, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సహకరించాలని కోరారు.
తుది విడత ఎన్నికల విషయమై కేంద్ర మంత్రికి భాజపా నేతల విజ్ఞప్తి
ఎంపీడీవో, ఆర్వో, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏకగ్రీవాలు చేశారని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఆరోపించారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
శ్రీకాళహస్తిలో భాజపా నేత కోలా ఆనంద్ మీడియా సమావేశం