ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాబాయ్‌నే కొట్టిన వ్యక్తి జగన్'

ఆ సీటు మా నాన్న రాజశేఖర్ రెడ్డిదని.. నువ్వు ఎంతకాలం ఉంటావ్ అని జగన్ తనపై చేయి చేసుకున్నట్లు' సోనియాకు.. వివేకా తెలిపారు- హర్షకుమార్

By

Published : Mar 17, 2019, 3:49 PM IST

Updated : Mar 17, 2019, 9:30 PM IST

జగన్​పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు

జగన్​పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణం ద్వారా జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ పేర్కొన్నారు. వివేకా మరణానంతర పరిణామాలపై ఫేస్​బుక్​లో కామెంట్లు పోస్ట్ చేశారు. జగన్మోహన్​రెడ్డి తన బాబాయి వివేకాపై రెండుసార్లు చేయి చేసుకున్నారని.. ఈ విషయం అప్పటి ఎంపీలందరికీ తెలుసని ఆ పోస్టులో వెల్లడించారు. 2006లో వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో జరిగిన సంఘటనను వివరించారు. వివేకా ఎవరికీ తెలియకుండా స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వద్దకు వెళ్లి రాజీనామా చేశారని చెప్పారు. దానిపై సోనియాగాంధీ పిలిపించి మాట్లాడగా... 'ఆ సీటు మా నాన్న రాజశేఖర్ రెడ్డిదని.. నువ్వు ఎంతకాలం ఉంటావ్ అని జగన్ తనపై చేయి చేసుకున్నట్లు' వివేకా తెలిపారన్నారు. వెంటనే సోనియా రాజశేఖర్​రెడ్డికి ఫోన్ చేసి తన కొడుకును అదుపులో పెట్టుకోవాలనీ... లేకపోతే అతనికి సీటు ఇవ్వనని హెచ్చరించారని తెలిపారు. ఈ విషయాలన్నీ అప్పటి రాష్ట్ర ఎంపీలందరికీ తెలుసని ఫేస్​బుక్ పోస్టులో హర్షకుమార్ వివరించారు.
Last Updated : Mar 17, 2019, 9:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details