కడశ్వాస వరకు రాజకీయాల్లోనే: పవన్
పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన ఆలోచనతో వచ్చిన పార్టీ జనసేన అని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజాతీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తామన్న పవన్... ప్రజాపోరాటంలో భాగమై ప్రత్యక్ష రాజకీయంలో ఉంటానని స్పష్టం చేశారు.
సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన ఆలోచనతోనే జనసేన ఆవిర్భవించిందని పవన్ అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... జనసేనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల్లో పోరాడటానికి ప్రజల్లో ఉంటామన్నారు. స్వచ్ఛ రాజకీయాలే లక్ష్యంతో పని చేశామని పవన్ అన్నారు. కొత్త తరంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసేన ప్రజాపోరాటం ఆడదని గుర్తుచేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలైనా తన కడశ్వాస వరకు ప్రజాజీవితంలో ఉంటానన్నారు. అధిక మెజార్జీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైకాపా అధినేత జగన్కు, కేంద్రంలో మరోసారి ప్రధాని అయిన మోదీకి అభినందనలు తెలిపారు.