ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీకి పయనమైన సీఎం

రేపు దిల్లీలో చేపట్టనున్న ధర్మపోరాట దీక్షకు హాజరయ్యేందుకు సీఎం, మంత్రులు హస్తినకు బయలు దేరారు.

By

Published : Feb 10, 2019, 10:24 PM IST

Updated : Feb 10, 2019, 11:44 PM IST

గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి

ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమైన సీఎం
దిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మరో విమానంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీకి పయనమయ్యారు. ప్రత్యేకహోదా కోరుతూ రేపు దిల్లీలో ధర్మపోరాటం చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి, 7:45 కు ఏపీ భవన్​కు సీఎం చేరుకోనున్నారు. ఉదయం 8 కి ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ధర్మపోరాట దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుతో పాటు ఎన్జీవో సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షలో పాల్గొననున్నాయి.
Last Updated : Feb 10, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details