ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎస్‌గా నేడు ఎల్​వీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్​వీ సుబ్రహ్మణ్యం ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

By

Published : Apr 6, 2019, 6:43 AM IST

Published : Apr 6, 2019, 6:43 AM IST

Updated : Apr 6, 2019, 8:12 AM IST

నేడు ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోనున్న ఎల్ వీ సుబ్రమణ్యం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్​వీ సుబ్రహ్మణ్యం నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్​వీ సుబ్రమణ్యం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐపీఎస్​ల బదిలీ జీవోల వ్యవహారంలో 5 రోజుల క్రితం దిల్లీ వెళ్లిన పునేఠా, కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తదుపరి ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న ఈసీ... పునేఠాను బదిలీ చేసింది. ఉదయం 10.30 గంటలకు కొత్త చీఫ్ సెక్రెటరీగా ఎల్​వీ సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Last Updated : Apr 6, 2019, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details