ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్బరుద్ధీన్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

By

Published : Jun 13, 2019, 10:13 AM IST

Updated : Jun 13, 2019, 10:34 AM IST

చంద్రబాబు

అనారోగ్యానికి గురైన ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ త్వరగా కోలువాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. దేవుడు ఆయన్ని మంచి ఆరోగ్యంతో ఉండేలా దీవించాలని ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్వీట్​ను అక్బరుద్ధీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు.
లండన్​లో చికిత్స
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై గతంలో హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. పలుమార్లు లండన్​లో చికిత్స తీసుకున్నారు. ఇటీవల మరోసారి అస్వస్థకు గురైన ఆయన గత నెలలో వైద్యం కోసం లండన్​ వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరంలో ఐరన్‌ కంటెంట్‌ తక్కువైందని, డాక్టర్లు ఆర్టిఫిషియల్‌గా ఐరన్‌ అందిస్తున్నారని ఎంఐఎం వర్గాలు చెప్పాయి .

Last Updated : Jun 13, 2019, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details