అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లిలో యువకులు ఓటు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈవీఎమ్ యంత్రాలు ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. ఈనాడు-ఈటీవీ భారత్, విజన్ యాత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... నీతి, నిజాయతీలతో సేవ చేసే నాయకుణ్ని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.
'ఓటు అమ్ముకుంటే పిల్లల భవిష్యత్ నాశనం'
ఓటును నోటుకు అమ్ముకుంటే... పిల్లల భవిష్యత్తను నాశనం చేసుకున్నట్లేనని...ప్లకార్డులు పట్టుకుని యువకులు నినదించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
ఓటు వినియోగంపై యువత ప్రచారం