ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Whip Ramachandra reddy on CM Jagan: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన -విప్ రామచంద్రా రెడ్డి

Whip Ramachandra reddy on New Districts: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతోందని ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి అన్నారు. అందుకు నిదర్శనమే 26జిల్లాల ఏర్పాటని తెలిపారు. సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Jan 28, 2022, 7:49 PM IST

Whip Ramachandra reddy on CM Jagan
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన -విప్ రామచంద్రా రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన -విప్ రామచంద్రా రెడ్డి

Whip Ramachandra reddy on CM Jagan: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతోందని ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి అన్నారు.అందుకు నిదర్శనమే 26జిల్లాల ఏర్పాటని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వినాయక సర్కిల్ లో శుక్రవారం సీఎం చిత్రపటానికి నిర్వహించిన పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజల ముంగిట పాలన అందించడం కోసం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న, చిన్న జిల్లాలతోనే ప్రజల అభివృద్ధి సంక్షేమం సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలాజీ ,అన్నమయ్య, ఎన్టీఆర్, సత్య సాయి బాబా, అల్లూరి సీతారామ రాజు వంటి మహనీయుల పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details