ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 22, 2021, 4:33 PM IST

ETV Bharat / state

'సాంప్రదాయంగా వస్తున్న పండుగను చేసుకోనివ్వండి'

అనంతపురంలోని దేవాదాయశాఖ కార్యాలయం వద్ద వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన చేశారు. చీలేవారిపల్లి శ్రీకాటికోటేశ్వరస్వామి ఆలయ వివాదానికి సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

'సాంప్రదాయంగా వస్తున్న పండుగను జరుపుకొనివ్వండి'
'సాంప్రదాయంగా వస్తున్న పండుగను జరుపుకొనివ్వండి'

అనంతపురం జిల్లా చీలేవారిపల్లి శ్రీకాటికోటేశ్వరస్వామి ఆలయ వివాదానికి సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని దేవాదాయశాఖ కార్యాలయం వద్ద ఆ గ్రామ ప్రజలతో కలిసి వారు ధర్నా చేపట్టారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున ఆలయ ఉత్సవాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈసారి ధర్మవరం ఎమ్మెల్యే అనవసరంగా జోక్యం చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. సాంప్రదాయంగా వస్తున్న పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details