ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాసేపల్లిలో వృద్ధునిపై చిరుత పులి దాడి

By

Published : Dec 16, 2020, 11:18 AM IST

Updated : Dec 16, 2020, 12:58 PM IST

చిరుత పులుల సంచారం గ్రామాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా రోళ్ల మండలంలో మంగళవారం రాత్రి చిరుత పులి ఓ వృద్ధునిపై దాడికి పాల్పడింది.

tiger attack
tiger attack

గొల్లహట్టిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

అనంతపురం జిల్లా రొళ్ళ మండలం నాసేపల్లిలో ఓ వృద్ధునిపై చిరుత దాడి చేసింది. పాతన్న అనే వృద్ధుడు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సమయంలో... అతనిపై చిరుత దాడికి పాల్పడింది. కాపాడండి అని వృద్ధుడు కేకలు వేయగా.. అతని అరుపులు విన్న చిరుత అతణ్ని.. వదిలి పరారైంది. వృద్ధుని కాలికి గాయమవ్వడంతో వృద్ధుణ్ని గ్రామస్థులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగానే ఉన్నాడు. అటవీశాఖ అధికారులు వృద్ధుణ్ని పరామర్శించి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Last Updated : Dec 16, 2020, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details