డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజ్ రియింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్ళపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు కోరారు.
చెవిలో పూలు పెట్టుకొని విద్యార్ధుల వినూత్న నిరసన
అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేస్తూ.. ఫీజ్ రియింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
చెవులో పూలు పెట్టుకొని విద్యార్ధుల వినూత్న నిరసన