ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాప్తాడు బరిలో శ్రీరామ్

మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతారని మంత్రి వెల్లడించారు.

By

Published : Mar 13, 2019, 6:06 PM IST

పరిటాల శ్రీరామ్

రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్​ను పోటీకి నిలిపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద నివాళులు అర్పించి మంత్రి సునీత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాలో 2 నియోజకవర్గాల్లో తనకు, తన కుమారుడు పరిటాల శ్రీరామ్​కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. రాప్తాడుతోపాటు మరో నియోజకవర్గం కేటాయించలేకపోతే, ఈసారి తన స్థానంలో శ్రీరామ్​ను పోటీకి నిలపాలని కుటుంబ సభ్యులు, పరిటాల అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం తమ అభ్యర్థన ముఖ్యమంత్రి ఎదుట ఉంచుతామని, అధినేత నిర్ణయం మేరకు ముందుకెళతామనిపరిటాల సునీత ప్రకటించారు.
తన తల్లి సునీత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే తాను రాప్తాడు నుంచి బరిలో దిగుతానని శ్రీరామ్ స్పష్టం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్​కనగానపల్లె మండలం ముత్తవకుంట్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తల్లీ, కుమారుడికి పూలజల్లుతో ప్రజలు స్వాగతం పలికారు.

ఇవి కూడా చూడండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details