ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 2:39 PM IST

ETV Bharat / state

వాళ్లు లాక్​డౌన్ ఉల్లంఘించారు.. వీళ్లు మిన్నకుండిపోయారు!

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి శింగనమల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. సాక్షాత్తు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమంలోనే లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోయారు.

ruling party leaders break the lock down rules
లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తూ సభ నిర్వాహణ

అనంతపురం జిల్లాలో శింగనమల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ సభకు వందల మంది జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకరామిరెడ్డి పాల్గొన్నారు.

సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘించినా కూడా పోలీసులు చూస్తూ మిన్నకుండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details