ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 1:10 PM IST

ETV Bharat / state

'ఎస్సీల వర్గీకరణకు తీర్మానం పెట్టండి'

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని అంబేడ్కర్ కూడలి సమీపంలో ఎస్సీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏబీసీడీ వర్గీకరణ జరపాలని డిమాండ్ చేశారు.

'ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ జరపాలి'
'ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ జరపాలి'

మడకశిరలో ఎస్సీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణకు తీర్మానం పెట్టి ఏకాభిప్రాయం తెలపాలని డిమాండ్ చేశారు. ఆ ఆమోదాన్ని కేంద్రానికి పంపి.. పార్లమెంట్​లో చట్టం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దళిత సంరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు, ముస్లిం నగారా టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details