ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2020, 8:16 PM IST

ETV Bharat / state

కరోనాతో అప్రమత్తంగా ఉండండి... వైద్యాన్ని అందించండి

కొవిడ్​ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కదిరి ప్రాంతీయ వైద్యశాలలో వైద్యులు, అధికారులతో స్థానిక శాసన సభ్యుడు సిద్ధారెడ్డి సమీక్షించారు.

కదిరి ప్రాంతీయ వైద్యశాలలో కరోనాపై సమీక్ష
కదిరి ప్రాంతీయ వైద్యశాలలో కరోనాపై సమీక్ష

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్​ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కదిరి ప్రాంతీయ వైద్యశాలలో సమీక్ష జరిగింది. 10 మండలాలలకు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిని ప్రభుత్వం కొవిడ్ వైద్యశాలగా మార్చింది. కరోనా బాధితులకు పరీక్షలతోపాటు, సాధారణ రోగులు ఇబ్బంది పడకుండా వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంపై స్థానిక శాసన సభ్యుడు సిద్ధారెడ్డి వైద్యులు, అధికారులతో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details