భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురానికి వచ్చారు. హిందూపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ ప్రభుత్వం తన సొంత ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. తెలుగు గంగ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు నికర జలాలు ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో భాజపా ప్రధాన అజెండా ఇదేనని పేర్కొన్నారు.
రాయలసీమకు నికర జలాలు ఇవ్వాల్సిందే: సోము వీర్రాజు
రాయలసీమకు నికర జలాలు ఇవ్వాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో భాజపా ప్రధాన అజెండా ఇదేనని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు భాజపా సముచిత గౌరవం ఇస్తుందని, అయన్ను తక్కువచేసి చూస్తున్నామనడం అసత్యమని చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సోము వీర్రాజు మాట్లాడారు.
సోము వీర్రాజు
తిరుపతి ఉప ఎన్నికలో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు భాజపా సముచిత గౌరవం ఇస్తుందని, అయన్ను తక్కువచేసి చూస్తున్నామనడం అసత్యమని చెప్పారు.
ఇదీ చదవండీ...'ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు..'