అనంతపురం జిల్లా మడకశిర మండలం క్యాంపురం గ్రామంలోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటకకు చెందిన శంకర్ అనే వ్యక్తి వద్ద 105 మద్యం ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసులు అతడిని అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు... గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తుల ఆచూకీ తెలిపి పోలీసులకు సహకరించాలని కోరారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాకు మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి మద్యం తరలిస్తున్న వారి వివరాలను స్థానికులు తెలపాలని పోలీసులు కోరారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు