ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 5, 2021, 4:49 PM IST

ETV Bharat / state

'కల్యాణదుర్గం మున్సిపాలిటీలో తెదేపా విజయం సాధిస్తుంది'

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీలో తెదేపా నేతలు ప్రచారం నిర్వహించారు. స్థానికంగా విజయం సాధిస్తామని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

municipal election campaign
తెదేపా విజయం

కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవి తమ పార్టీకే దక్కుతుందని అనంతపురం తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమామహేశ్వర నాయుడుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కల్యాణదుర్గం మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు పేరుకు పోయాయని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:ఎద్దులను ఎత్తుకెళ్లిన దుండగులు.. జీవనాధారం కోల్పోయిన దంపతులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details