ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 29, 2020, 8:41 PM IST

ETV Bharat / state

హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా జలాలను నింపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాలువ పనులను ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పరిశీలించారు.

mla examained handineeva canal at madakasira
హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హాంద్రీనీవా కాలువపనులను ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మల్లికార్జున పరిశీలించారు. చెరువులకు హంద్రీనీవా జలాలు నింపనున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు మడకశిర చెరువుకు చేరగా.. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు మిగిలి ఉన్నాయి. వీటిలో అమరాపురం, అగళి రెండు మండలాలకు కృష్ణా జలాలు అందించేందుకు కాలువ పనుల్లో చిన్నపాటి పనులు మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి.

మరో పదిహేను రోజుల్లో ఈ రెండు మండలాలకు కాలువ ద్వారా నీరును పంపిస్తున్నారు. వచ్చే సంవత్సరం నియోజకవర్గంలోని అన్ని మండలాలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తిచేస్తామని ఇంజినీర్ అన్నారు. నియోజకవర్గంలోని 230 చెరువులకు కృష్ణా జలాలు నింపుతామని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details