ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2020, 11:48 AM IST

ETV Bharat / state

వాదనలు కాదు... రాజీయే రాజమార్గం...

అనంతపురంలో లోక్ అదాలత్​ను నిర్వహించనున్నట్లు న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి వెల్లడించారు.

lok adalat in anantapur
అనంతపురంలో లోక్ అదాలత్

అనంతపురంలో లోక్ అదాలత్

ఈ నెల 8న అనంతపురంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. రాజీయే రాజ మార్గంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని దాదాపు 30 వేల కేసుల్లో రాజీ చేసే అవకాశాలు ఉన్న 14 వందల కేసులు గుర్తించినట్లు తెలిపారు. లోక్ అదాలత్​లో వచ్చిన తీర్పే చివరి తీర్పనీ, ఇక్కడ తీర్పు వచ్చిన తరువాత తిరిగి అప్పీలు చేసుకోవటానికి వీలుపడదని స్పష్టం చేశారు. కేసు విచారణ ఇక్కడే పూర్తైతే న్యాయస్థానంలో కట్టిన ఫీజు వెనక్కి ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details