ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురం బంద్ ఉద్రిక్తం.. భజరంగ్​దళ్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించాలంటూ అఖిలపక్షాలు తలపెట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది. భజరంగ్ దళ్ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By

Published : Jan 29, 2022, 10:21 AM IST

Updated : Jan 29, 2022, 12:11 PM IST

hindupuram bandh
hindupuram bandh

హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన హిందూపురం పట్టణ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడగా.. అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న ఆందోళనకారులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.

భజరంగదళ్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భజరంగదళ్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నాని పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అతణ్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: Whip Ramachandra reddy on CM Jagan: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన -విప్ రామచంద్రా రెడ్డి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 29, 2022, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details