అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కందిగోపుల గ్రామంలో గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వీచిన గాలి, వానకి బిసాటి శ్రీరాములు అనే రైతుకు చెందిన 3 ఎకరాలలో మునగ పంట దాదాపుగా 150 మునగ చెట్లు నేలకొరిగాయి. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కాపుకు వచ్చే సమయంలో ఇలా జరగడంతో తీవ్రంగా నష్ట పోయానని రైతు కన్నీరు మున్నీరయ్యాడు.
గాలీ వాన బీభత్సం.. నెలకొరిగిన మునగపంట - ananthapuram district
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. గాలికి చెట్లు నెలకొరిగాయి. పంటలు నాశనమయ్యాయి.

గాలీ వాన భీభత్సం