ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2020, 2:54 PM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడు మృతి

మగ్గం వద్ద అమర్చిన విద్యుత్​ మోటార్​ తగిలి విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

Handloom worker killed by electric shock
విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడి మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పీఆర్​టీ కాలనీలో చేనేత మగ్గంపై పని చేస్తున్న రంగం వేణుగోపాల్ విద్యుదాఘాతానికి గురై.. అక్కడిక్కడే మృతి చెందాడు. చేనేత మగ్గంపై ఉన్న 'జా కార్డులు' సులభ రీతిలో కదిలేందుకు విద్యుత్ మోటరు ఏర్పాటు చేసుకున్నాడు. మగ్గం నేస్తున్న సమయంలో వేణుగోపాల్ చేయి మోటారు వద్ద ఉన్న తీగలకు తాకడంటో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని కార్మికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details