ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2020, 4:01 PM IST

ETV Bharat / state

ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా సామాన్యల జీవనం స్తంభించిపోయిందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో దాతలు ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.

ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. దాదాపు 100 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరకులు అందించారు. లాక్​డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కష్టకాలంలో దాతలు ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details