ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్

వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని అనంతపురం తెదేపా నేత వెంకట ప్రసాద్ అన్నారు. వరద ముంపుపై కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

By

Published : Aug 21, 2019, 5:03 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు : తెదేపా నేత వెంకట ప్రసాద్

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు : తెదేపా నేత వెంకట ప్రసాద్
వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నేత కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న కేంద్రం హెచ్చరికను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వలనే రాజధాని ప్రాంతం ముంపునకు గురై, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలను ఆదుకోవడంలో విఫలమై ప్రభుత్వం విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details