ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2020, 3:25 PM IST

ETV Bharat / state

అనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ పర్యటన

అనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ పర్యటిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో విజయన్ పాల్గొననున్నారు. ఈ బహిరంగసభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకానున్నారు. సీపీఐ నేత నారాయణతోపాటు సీఎం విజయన్‌ను ఎంపీ కేశినేని నాని కలిసారు.

Cpi,Tdp Leaders Meet Kerala Cm in ananthapuram
Cpi,Tdp Leaders Meet Kerala Cm in ananthapuram

అనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ పర్యటన

సీఏఏ,ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా అనంతపురంలో సీపీఎం చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ నగరానికి వచ్చారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న కేరళ సీఎంకు సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో విజయన్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో బెదిరింపులతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ను వారు కలిశారు.

ABOUT THE AUTHOR

...view details