సమయపాలనకు అనుగుణంగా పౌష్టికాహారం తీసుకోవటం వల్ల కరోనాపై విజయం సాధించవచ్చని... కరోనా నుంచి విముక్తి చెందినవారు తెలిపారు. కరోనాపై విజయం సాధించిన పలువురు వ్యక్తులను అనంతపురం మున్సిపల్ అధికారులు పరిచయం చేశారు.
జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తీరును వారు వివరించారు. వైద్యులు వారిపట్ల చూపిన ప్రేమాభిమానాలను అక్కడ ఉన్న మౌలిక వసతులు పలు అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా వస్తే ఎవరు భయపడాల్సిన పనిలేదని.. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకోవటం వల్ల పునరావృత స్థితికి రావచ్చని చెప్పారు.